హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఇంటిపై గుర్తు తెలియని యువకులు రాళ్లతో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ముఖ్యమంత్రి ఇంటిపై రాళ్లు విసిరి బైక్ పై పారిపోయారు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ప్రతి రోజూలాగే శుక్రవారం అర్థరాత్రి సచిన్, మోను అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు డ్యూటీలో ఉన్నారు. అర్థరాత్రి ఆకస్మాత్తుగా బైక్లపై వచ్చిన కొందరు యువకులు ముఖ్యమంత్రి ఇంటి పై రాళ్లు విసిరారు. వెంటనే సెక్యూరిటీ గార్డు సచిన్ బయటకు వచ్చి నిందితులను వెంబడించే ప్రయత్నం చేశాడు కానీ తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న రాంనగర్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓ కిరణ్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను కూడా చెక్ చేశారు.ఈ ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు కూడా ముఖ్యమంత్రి నివాసం బయట గుమిగూడి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇంటిపై ఇలా రాళ్లు రువ్వడంకరెక్ట్ కాదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారన్నారు. తాను బయటకు వచ్చేసరికి ఓ యువకుడు బైక్పై వెళుతుండగా, మిగతా యువకులు రాళ్లు రువ్వుతున్నారని సెక్యూరిటీ గార్డ్ సచిన్ తెలిపాడు. ఇక స్థానిక బీజేపీ కార్యకర్తలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాంనగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కిరణ్ తెలిపినట్లు సమాచారం.