Bear: దైవ దర్శనానికి వెళ్లిన ఆ భార్యాభర్తల జంటకు ఎలుగుబంటి రూపంలో మృత్యువు ఎదురైంది. ఆ జంటపై దాడిచేసిన ఎలుగు బంటి ఇద్దర్నీ చంపి తింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పన్నా జిల్లాలోని రాణిగంజ్కు చెందిన ముఖేష్ ఠాకూర్(50), ఇందిరా ఠాకూర్(45) దైవ దర్శనం కోసం ఆదివారం ఖెర్మయ్లోని గుడికి వెళ్లారు. గుడి అడవికి అతి దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో గుడికి వెళుతున్న ఆ జంటపై ఎలుగు బంటి దాడి చేసింది. ఇద్దర్నీ చంపి, అడవిలోకి లాక్కుపోయింది. సాధారణంగా ఎలుగుబంట్లు మనుషుల్ని తినవు.. కానీ, ఈ ఎలుగు బంటి ఆ ఇద్దర్నీ పీక్కు తింది. 5గంటల పాటు ఒక్కో శరీరభాగాన్ని పీక్కు తింది.
తోటి భక్తులు అటవీ శాఖ సిబ్బందికి ఈ సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. ఎలుగు బంటి శవాల్ని పీక్కు తినటం గుర్తించారు. దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, స్ప్రహ కోల్పోయేలా చేశారు. అనంతరం మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. పట్టుకున్న ఎలుగుబంటిని ఇంకా అడవిలో వదలలేదు. దాన్ని వేరే నగరంలోని జూకి పంపేందుకు ఆలోచిస్తున్నారు. ఇక ఎలుగుబంటి దాడిలో చనిపోయిన మృతుల కుటుంబానికి అధికారులు 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : KA పాల్ పై శ్రీకాంతచారి తల్లి ఆగ్రహం!