మద్యం అలవాటు..చాలా మంది జీవితాలను నాశనం చేస్తుంది. దానికి బానిసైన వారు అనేక దారుణాలు చేస్తుంటారు. మద్యం కోసం ఇంట్లో వస్తువులను, సంపాదను అమ్మి మరి తాగుతుంటారు. మరి కొందరు మంచి ఉద్యోగం సంపాదించి కూడా.. మద్యం అలవాటు కారణంగా వాటిని కోల్పోయి రోడ్డున పడతారు. తాజాగా ఓ రైల్వే లోకో పైలట్ మద్యం కోసం రైలు ఆపి.. ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నాడు. ఈ ఘటన బీహర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బీహర్ లోని సమస్తీపూర్ నుంచి సహర్సాకు ప్రయాణించే ప్యాసింజర్ రైలును అసిస్టెంట్ లోకో పైలట్ కర్మవీర్ ప్రసాద్ నడుపుతున్నాడు. ఈక్రమంలో రైలు హసన్ పూర్ స్టేషన్ కి చేరుకుంది. స్టేషన్ లో రైలు ఆపి అనంతరం మద్యం కోసం బయటకు వెళ్లాడు. ఈ సమయంలో స్టేషన్ మాస్టర్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసిస్టెంట్ లోకో పైలట్ లేకపోవడంతో వల్ల రైలు ముందుకు కదలేదు. చాలా సమయంలో పాటు రైలు స్టేషన్ లో ఆగిపోయింది. సిగ్నల్ ఇచ్చినా రైలు కదలకపోవడంతో స్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.సమీపంలోని ఓ మద్యం దుకాణం వద్ద డ్రైవర్ మత్తులో కనీసం నిలబడలేని పరిస్థితిలో కనిపించాడు. దీంతో అతన్ని వెంటనే అరెస్టు చేయడంతో పాటు ఉన్నతాధికారులు మెమో జారీచేశారు. ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ విచారణకు ఆదేశించారు. చాలా సమయంలో రైలు ఆగడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైలును పంపించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.