సైనికుడు అంటే.. తన కోసం కాకుండా దేశం కోసం ఆలోచిస్తాడు. తన కుటుంబం మాత్రమే బాగుంటే చాలు అనుకోడు.. దేశంలోని అన్ని కుటుంబాలకు తానే రక్ష అని భావిస్తాడు. అందుకే ఏదో ఓ రోజు యుద్ధ భూమిలో మరణం తప్పదని తెలిసినా.. ప్రాణాత్యాగాన్ని సైతం చిరునవ్వుతో అంగీకరించి.. సరిహద్దులో మనకు కాపలాగా నిలుస్తాడు. దేశం కోసం ఇంతటి త్యాగం చేస్తున్న వారి పట్ల కనీస ఆదరణ చూపని ప్రభుత్వాలు ఎన్నో. ఉద్యోగ విరమణ తర్వాత, మరణించిన తర్వాత.. సైనికుడి తరఫున వారి కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాలను సత్వరం వారికి అందకుండా.. మోకాలు అడ్డుపెట్టే అధికారులు ఎందరో మన సమాజంలో ఉన్నారు. ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ అమర జవాను భార్యకి. భర్త మృతి అనంతరం తనకు రావాల్సిన పెన్షన్ డబ్బు కోసం ఏకంగా 56 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం చేసి.. ఎట్టకేలకు విజయం సాధించింది. బాధితురాలికి 6 శాతం వడ్డీతో మొత్తం పెన్షన్ చెల్లించాల్సిందిగా చండీగఢ్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: స్టూడెంట్ నం.1 సినిమాలో ఎన్టీఆర్లా.. నాన్న కోసం 16 ఏళ్లు పోరాటం!
కేసు వివరాల్లోకి వెళితే పంజాబ్కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ ప్రతాప్ సింగ్ 1962 భారత్- చైనా యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం పెన్షన్ను ప్రతాప్ సింగ్ భార్య ధర్మోదేవికి ఇచ్చేది. నాలుగేళ్ల తర్వాత ఉన్నట్టుండి 1966 నుంచి ఆమెకు రావాల్సిన పెన్షన్ నిలిచిపోయింది. దీని గురించి.. ధర్మోదేవి అధికారులను కలిసి విన్నవించుకున్నా.. సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఆమె న్యాయపోరాటాన్ని ఆశ్రయించారు. పంజాబ్ హరియాణా హైకోర్టులో ధర్మోదేవి పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: AP మంత్రికి వెరైటీ స్వాగతం.. కరెన్సీ నోట్లు చల్లుతూ రచ్చ చేసిన అభిమానులు!
ఈ పిటిషన్పై న్యాయస్థానం 56 ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ కొనసాగించింది. చివరకు జస్టిస్ హర్సిమాన్సింగ్ సేఠీ ధర్మాసనం ఇటీవల తీర్పును వెల్లడించింది. బాధితురాలికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాధితురాలు 56 ఏళ్లుగా తన చట్టబద్ధమైన హక్కులను కోల్పోయారని, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని అలవెన్సులు పొందేందుకు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. విచారణ అనంతరం.. ఆమెకు భత్యాలతోపాటు పింఛను పునరుద్ధరించాలని హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక బాధితురాలికి 6 శాతం వడ్డీతో మొత్తం పెన్షను చెల్లించాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: బాలీవుడ్ లో KGF-2 కలెక్షన్స్ సునామీ! బీ-టౌన్ గాలి తీసిన RGV ట్వీట్!
ఈ కేసు విచారణ సందర్భంగా పెన్షన్ నిలిపివేయడం తమ ఉద్దేశం కాదని.. సమాచారంలోపం వల్లే ఇలా జరిగిందని.. కేంద్రం, సీఆర్ఫీఎఫ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఏది ఏమైనా ఓ అమర జవాను భార్య.. తనకు హక్కుగా సంక్రమించిన పెన్షన్ పొందేందుకు ఇనేళ్లపాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి రావడం సరికాదు అంటున్నారు నెటిజనులు. ఇప్పటికైనా కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెల్లడించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి