AAP MLA: ఎన్నికల్లో గెలవటానికి రాజకీయ నాయకులు ఎన్ని పాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల్ని ఆకట్టు కోవటానికి చేయాల్సిన అన్ని రకాల పనులు చేస్తుంటారు. తమను తాము నేల టిక్కెట్టు వాళ్లలాగా ప్రొజెక్టు చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. తాము కూడా సామాన్య ప్రజల్లో ఒకరమే అని చెప్పుకోవటానికి నానాతంటాలు పడుతుంటారు. నేలపై కూర్చుంటారు.. మట్టి కంచంలో తింటారు.. ఇలా ఎన్నెన్నో చేస్తుంటారు. కొంతమంది బాగా డబ్బున్న వాళ్లు కూడా తమ డబ్బును పక్కన పెట్టి, ప్రచారం సమయంలో కొన్ని రోజులైనా సాధారణ ప్రజల్లా తిరుగుతుంటారు. ఎన్నికలు అయిపోగానే తమ రేంజ్ ఏంటో చూపిస్తుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగీ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన లుథియానా ఎమ్మెల్యేగా నామినేషన్ వేయటానికి స్కూటీపై వెళ్లారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ సీన్ మారిపోయింది. స్కూటీ కాస్తా కాస్ట్లీ కారుగా అయిపోయింది. పోస్ అనే కాస్ట్లీ కారులో మున్సిపల్ ఆఫీసుకు వెళ్లారు. పసుపు రంగులో ఉన్న ఆ అద్భుతమైన కారును చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇక నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ధనవంతుడు పేద వాడిగా నటించాడా? లేక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ధనవంతుడు అయ్యాడా? అని ప్రశ్నిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Assistant Loco Pilot: రైలు ఆపి.. మద్యం కోసం వెళ్లిన డ్రైవర్! మండిపడుతున్న నెటిజన్లు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి