ముంబయి- ముకేశ్ అంబానీ.. ఈ పేరు తెలియని వారు దాదాపు ప్రపంచంలో ఉండరని చెప్పవచ్చు. భారత దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అపర కుభేరుడు ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని పెద్ద కంపెనీల్లో ఒకటి. సుమారు 6 లక్షల కోట్ల రూపాయలతో ముకేశ్ అంబానీ మన దేశంలో అత్యంత ధనవంతుడింగా రికార్డుల్లోకి ఎక్కారు.
గత కొన్నాళ్లుగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భారత దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముకేశ్కుటుంబంతో సహా లండన్ లో స్థిరపడనున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇకపై ముకేశ్ ఫ్యామిలీ అంతా విదేశాల్లోనే ఉండనున్నారని, అప్పుడప్పుడు భారత్ కు వచ్చి వెళ్తారని అంతా అనుకుంటున్నారు.
ముకేశ్ అంబానీ ఫ్యామిలీ లండన్ లో నివాసం ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖండించింది. లండన్ లోని స్టోక్ పార్క్ లో అంబానీ కుటుంబం నివాసం ఉంటారని సోషల్ మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొట్టిపారేసింది. ముకేశ్ అంబానీ కుటుంబం లండన్ లేదా ప్రపంచంలో మరెక్కడా నివాసం మార్చడానికి ఎటువంటి ప్రణాళికలు లేవని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్పష్టం చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాదాపు అన్ని దేశాల్లో రిలయన్స్ కార్యాలయాలు ఉన్నాయి. చాలా దేశాల్లో అంబానీ కుటుంబానికి ఖరీదైన బంగళాలు ఉన్నాయి. అయినప్పటికీ తమ కుటుంబం భారత్ లోనే నివాసం ఉంటుందని, విదేశాల్లో స్థిరపడే ఆలోచనే లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ తేల్చిచెప్పింది.
Reliance Industries clarifies that RIL Chairman Mukesh Ambani and his family have no plans to relocate or reside in London; calls speculation “unwarranted and baseless”
Read at https://t.co/EspIRqEUvZ#StokePark #London #Ambani #RelianceIndustries
— moneycontrol (@moneycontrolcom) November 5, 2021