Megastar Chiranjeevi: టాలీవుడ్లో మెగా ఫ్యామిలీది ఓ ప్రత్యేక స్థానం. అయితే.. కేవలం సినిమాల విషయంలోనే కాదు భక్తి విషయంలోనూ మెగా ఫ్యామిలీ హీరోలు ముందుంటారు. మెగాస్టార్ చిరంజీవి ప్రతీ ఏటా అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు. తండ్రి అడుగుజాడల్లో నడిచే రామ్చరణ్ కూడా ప్రతీ ఏటా అయ్యప్ప మాల వేస్తుంటారు. ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప మాలలోనే ఉన్నారు. అంతేకాదు! మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు. ఈ విషయాన్ని చాలా వేదికల్లో చిరంజీవి స్పష్టం చేశారు. ఆంజనేయ స్వామి అంటే తనకు ఎనలేని భక్తని పేర్కొన్నారు. ఇక ఈ శనివారం హనుమాన్ జయంతి కావటంతో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు చిరు.
ఇక భక్తి విషయంలోనూ, జంతువులను ప్రేమించే విషయంలోనూ రామ్చరణ్ తనకు తగ్గ తనయుడు అని తెలియజెప్పే ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు మెగాస్టార్. రామ్చరణ్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్లో ఉన్నప్పటి వీడియో అది. ఆ వీడియోలో ఓ రిసార్ట్ గదిలో కూర్చుని రామ్ చరణ్ మేకప్ వేసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఓ కోతి అక్కడకు వస్తుంది. ఆ కోతి మేకప్ వేసుకుంటున్న రామ్ చరణ్ను చూస్తుంది. రామ్ చరణ్ దాన్ని చూడగానే పక్కకు వెళ్లిపోవటానికి చూస్తుంది. కానీ, రామ్ చరణ్ బిస్కెట్ ప్యాకెట్ చూపించటంతో దగ్గరకు వస్తుంది. ఆయన కూర్చున సోఫాలో కూర్చుంటుంది.
రామ్ చరణ్ దానికి ఒక బిస్కెట్ ఇస్తాడు. కోతి దాన్ని తింటుంది. చూడటానికి బాగా అనిపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ఈ వీడియోను షేర్ చేయటంపై అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, విడుదలైన చిత్ర ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తున్నారు. భారీ అంచనాలతో భరిలో దిగబోతున్న ఈ సినిమా ఎన్ని రికార్డులు తిరగరాయబోతోందో వేచి చూడాలి. మరి, చిరంజీవి పోస్ట చేసిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !#happyhanumanjayanthihttps://t.co/SiZ2fbdyJ0@AlwaysRamCharan
— Acharya (@KChiruTweets) April 16, 2022
ఇవి కూడా చదవండి : పాన్ ఇండియాలో నాకు పోటీ పెరగలేదు: ప్రభాస్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.