KTR : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా విదేశీ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పలు కంపెనీలతో వరుస భేటీలు నిర్వహిస్తూ క్షణం తీరకలేకుండా ఉన్నారు. ఎంతలా అంటే లంచ్ కూడా హోటల్లో కూర్చుని తినటానికి కూడా అవకాశం లేకుండా. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన రోడ్డు పక్క ఫుడ్ స్టాల్లో భోజనం చేస్తున్న ఫొటోలు వైరల్గా మారాయి. తాజాగా, ఆయన మ్యాన్హట్టన్లో ఓ బిజినెస్ మీటింగ్ అవ్వటానికి వెళ్లారు. ఆ సమయంలో హోటల్లో కూర్చుని భోజనం చేసే టైం లేక రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ దగ్గర ఆగారు. హలాల్ పుడ్ అనే ఫుడ్స్టాల్లో స్వయంగా ఆయనే డబ్బులు ఇచ్చి భోజనం కొనుక్కునున్నారు. అక్కడే ఫుట్పాత్పై భోజనం చేశారు. అనంతరం కొంతమందితో ఫొటోలు దిగి, అక్కడినుంచి వెళ్లిపోయారు.
కాగా, కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా ఓ కంపెనీతో పెట్టుబడికి ఒప్పందం కుదిరింది. ఫిష్ ఇన్ అనే కంపెనీ 1000కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టంని అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేస్తున్న పెద్ద కంపెనీ కావటం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద కంపెనీని నెలకొల్పనుంది. ఈ కంపెనీ ద్వారా సుమారు 5000 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
ఇవి కూడా చదవండి : తెలంగాణకు రూ.1,000 కోట్ల పెట్టుబడి.. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం!