క్రైస్తవ మత బోధకుడిగా.. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన డాక్టర్ కేఏ పాల్ గురించి అందరికి తెలిసి కదా. ఆయన పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచ దేశాధినేతలు తనతో నిత్యం టచ్ లో ఉంటారని, తాను మాట్లాడి చాలా దేశా మధ్య యుద్ధాలను ఆపేశాను అంటూ చెప్పుకుంటారు. తన అపాయింట్మెంట్ కోసం అనేక దేశాల అధినేతలు ఎదురు చూస్తారని చెప్పుకునే వారు. అలాంటి కేఏ పాల్ గురించి ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకి వచ్చింది. అంత చేస్తాను.. ఇంత చేస్తాను అని గొప్పలు చెప్పుకుని కేఏ పాల్ తన ఇంటికి ఈఎంఐ కట్టుకోలేకపోతున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ పెట్టి కేఎ పాల్ ఆంధ్రప్రదేశ్ లో చేసిన హంగామా గురించి అందరికి తెలిసిందే. రాజకీయల గురించి, అందులో ఆయన ప్రాధానత్య గురించి కోటలు దాటేలా మాటలు చెప్పారు. ఎన్నికల సమయంలో ఆయన చెప్పే మాటలకు.. ఆయనో జోకర్ అని కొందరు అభిప్రాయాపడ్డారు. అంతే కాకా తాను సీఎం, పీఎం అయితే తనకు ఇతర దేశాధినేతలతో ఉన్న పరిచయాలతో ఫండ్స్ తెప్పిస్తాన్ని అంటుండేవారు. ఇటీవల ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ఆపడానికి చాలా ప్రయత్నం చేసినట్లు తెలిపాడు.శాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరిని ఏకం చేయడమే తన ప్రధాన ఉద్దేశమని చెబుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చెప్పే మాటలకు ఈయన ఎంత ధనవంతుడు రా బాబు.. అనే సందేహం రాక మానదు.
అయితే ఇంతలా గొప్పలు చెప్పకుంటున్న కేఏ పాల్ అమెరికాలోని తన ఇంటి EMI కట్టలేకపోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. అతని కుటుంబ సభ్యులు డబ్బులు సంపాదించి ఆ ఇంటిని నడిపిస్తున్నట్లు సమాచారం.కేఏ పాల్ ను ఆయన కుటుంబ సభ్యులు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని ఓ పాడుపడ్డ ఇంట్లో ఉంటూ లైవ్ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతూ..వాటి ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఆయన జీవిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఇల్లు అప్పునే కట్టలేని వాడు.. ప్రపంచలోని పేద దేశాలను ఆదుకుంటాడంటా. ఇక ఇలాంటి బిల్డప్ మాటలు చెప్పడం ఎందుకు? అనే విమర్శలు పాల్ పై వస్తున్నాయి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.