నిత్యం ఏదో ఒక ఆవిష్కరణాలతో వార్తల్లో నిలిచే చైనా.. గత రెండేళ్లుగా కరోనా పుట్టినిల్లుగా ప్రఖ్యాతి గాంచింది. అయితే ఈసారి మళ్లీ సరికొత్త ఇన్నోవేషన్ తో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. భార్యతో కలిసి షాపింగ్ కు వెళ్లే ప్రతి మగాడికి ఊరటనిచ్చే ఐడియాతో డ్రాగన్ దేశం మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. ఇంతకీ చైనా చేసిన ఆవిష్కరణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భార్యతో కలిసి షాపింగ్ కు వెళ్లే మగాళ్లకు చైనా శుభవార్త అందించింది. సాధారణంగా అమ్మాయిలు షాపింగ్ అంటే ఎక్కడలేని ఇష్టం చూపిస్తారు. కొన్నా, కొనకున్నా పది రకాల దుకాణాలు తిరుగుతూ.. నచ్చిన వాటి కోసం వెతుకుతుంటారు. ఆ సమయంలో పక్కన తోడుగా వెళ్లిన భర్తకో, అన్నకో, తమ్ముడికో బోరు కొడుతుంది. అలాంటి వారికోసం చైనా సరికొత్త ఆలోచన చేసింది. షాంఘైలోని గ్లోబల్ హార్బర్ మాల్ లో హస్బెండ్ స్టోరేజ్ పాడ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ పాడ్స్ లో ఓ వ్యక్తి కూర్చుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. షాపింగ్ కు వచ్చిన కస్టమర్లు ఆ పాడ్స్లో కుర్చొన్న సమయంలో వారు వైరే లోకంలో ఉన్నారనే అనుభూతిని కలిగించేందుకు వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు ప్రత్యేక వసతులు కల్పించింది. గేమ్స్ ఆడుకునేందుకు వీలుగా మానిటర్, గేమ్ ప్యాడ్స్ ఇతరత్రా కనీస అవసరాలను ఏర్పాటు చేసింది.
అయితే ప్రస్తుతానికి వినియోగదారులకు పాడ్స్లో ఉచితంగా గేమ్స్ ఆడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని షాపింగ్ మాల్స్ యజమానులు చెబుతున్నారు. హస్బెండ్ స్టోరేజ్ పాడ్స్ కు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఐడియా ఏదో బాగుందని చాలా మంది పురుషులు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.