Andhra Pradesh: ఈ సృష్టిలో పుట్టిన వారు మరణించక తప్పదు అన్నట్లు.. అప్పు చేయటం కూడా తప్పదు. ఏదో ఒక విషయంలో ఏదో ఒకసారి తప్పక అప్పు చేయాల్సి వస్తుంది. అప్పులు చేయటం కూడా మన తాహతకు తగ్గట్టుగా చేయాలి. అప్పు తిరిగి తీర్చగలిగే మార్గాలు తెలిసున్నపుడు మాత్రమే అప్పు చేయాలి. అలా కాదని అప్పులు చేస్తే.. కష్టాలు అప్పు తీసుకున్నట్లే. మనకు అప్పిచ్చిన వాళ్లు మంచోళ్లయితే.. ఇచ్చిన కాడికి తీసుకుని లేదంటే గమ్మునుండిపోతారు. ఒక వేళ అప్పిచ్చిన వాళ్లు రక్తం పీల్చే జలగలైతే మాత్రం.. పరిస్థితి దారుణంగా ఉంటుంది. అప్పులోళ్ల వేధింపులు భరించలేక చాలా మంది ప్రాణాలు సైతం తీసుకున్నారు.
మరికొన్ని సందర్భాల్లో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని రోడ్డున పడ్డవాళ్లు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. చిట్టీల పేరుతో జనాల్ని మోసం చేయటం మరొక ఎత్తు. చిట్టీలు వేసి చాలా మంది నష్టపోయారు.. నష్టపోతున్నారు. ఇలా చిట్టీల పేరుతో మోస పోయిన వారిలో చాలా మంది పోలీసులు.. కేసులు ఎందుకని ఊరుకుంటూ ఉంటే.. మరి కొంతమంది ఆగ్రహానికి గురై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఓ సంఘటనే జరిగింది. చిట్టీల డబ్బు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో చిట్టీ వేసిన వాళ్లు ఓ మహిళను స్తంభానికి కట్టేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే… ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం శివినికి చెందిన శోభ అనే మహిల చిట్టీల పేరుతో స్థానికుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది.
చిట్టీల డబ్బు మొత్తం ఎగ్గొట్టింది. వాళ్లు డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావ్ అని అడిగితే.. అప్పుడు, ఇప్పుడు అంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో చిట్టీలు వేసిన వాళ్లకు కోపం వచ్చింది. శుక్రవారం ఆమెను ఓ భవనంలోని స్తంభానికి కట్టేశారు. డబ్బులు తిరిగి ఇచ్చే వరకు వరకు కట్లు విప్పమని తెగేసి చెప్పారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వాళ్లకు సర్ధి చెప్పి, మహిళ కట్లు విడిపించేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Tirupati: చూడటానికి అమాయకురాలిగా, అందంగా ఉంది! ఆమె చేసిన పనికి పోలీసులే నోరెళ్లబెట్టారు!