Wife: భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని, ఉద్యోగంలో చేరితే తనని వదిలిపెట్టి వెళ్లిపోతుందని భావించిన ఓ భర్త ఆమె కుడి చెయ్యి నరికేసిన సంఘటన విధితమే. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని బుర్ధ్వాన్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోజల్సా గ్రామానికి చెందిన షేర్ మహమ్మద్, రేణు ఖాతున్ భార్యాభర్తలు. రేణు దుర్గాపూర్ లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో పాస్తై ఉద్యోగం సాధించింది. ఆమె ఉద్యోగం చేయడం భర్త షేర్ మహ్మమద్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. భార్య ఉద్యోగానికి వెళ్తే తనను విడిచిపెట్టి వెళ్లిపోతుందని అతడు భయపడ్డాడు.
దీంతో ఆమెను ఉద్యోగం చేయడానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి భార్యభర్తల మధ్య గోడవలు జరుగుతున్నాయి. భార్య చెప్పిన మాట వినకపోవటంతో ఆగ్రహానికి గురయ్యాడు. భార్యను ఎలాగైనా ఉద్యోగానికి పోనివ్వకుండా చేయాలని ఓ క్రూరమైన నిర్ణయానికి వచ్చాడు. జూన 5వ తేదీ రాత్రిన స్నేహితులతో కలిసి ఇంట్లోకి ప్రవేశించాడు. పదునైన ఆయుధంతో భార్యపై దాడి చేశాడు. ఆమె కుడి చేయిని నరికేశాడు. ఆ తర్వాత చెయ్యిని తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత రేణు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.బాధతో విలవిల్లాడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె పరిస్థితి నిలకడగా మారింది. భర్త తనకు చేసి అన్యాయానికి రేణు ప్రతి ఘటన మొదలుపెట్టింది. చెయ్యి నరికేసినంత మాత్రాన తాను ఉద్యోగానికి పోకుండా ఉండనని తేల్చిచెప్పింది. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూనే ఎడమ చేతితో రాయటం ప్రాక్టీస్ చేస్తోంది. ఎలాగైనా ఉద్యోగం చేసి తీరతానంటోంది. ప్రస్తుతం ఆమె ఎడమ చేతితో చేతి రాత ప్రాక్టీస్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి, రేణు పట్టుదలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ranga Reddy: యువతి కోరుకున్నవాడితో లవ్ మ్యారేజ్! కట్ చేస్తే పెళ్లైన 3 నెలలకే భర్తతో గొడవపడి!