ఈ మధ్యకాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లో కన్నా ప్రేమ పెళ్లిల్లోనే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. ప్రేమించి వివాహాలు చేసుకుని కలకాలం సంతోషంగా ఉంటారనుకుంటే పెళ్లైన ఏడాదికే భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. వీటి కారణంగా కొందరు హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్యలకు చేసుకోవడం చేస్తున్నారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వివాహితకు చివరికి నిరాశే మిగిలింది. ఇష్టపడి చేసుకున్న భర్తతో విభేదాలు వచ్చాయి. ఇవి రాను రాను విడాకుల వరకు వెళ్లాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ ఇల్లాలు భర్త ఇంటి ముందు న్యాయం కోరుతూ ధర్నాకు దిగింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అది వరంగల్ రూరల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామం. ఇదే గ్రామానికి చెందిన మక్క వినోద్ అనే యువకుడు స్థానికంగా ఉండే రవళి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. దీనికి రవళి కూడా అంగీకరించడంతో కొంత కాలం వీరి ప్రేమాయణం కొనసాగింది. అయితే వీరిది ఒకే సామాజిక వర్గం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు కూడా సపోర్ట్ చేశారు. ఇక వీరి పెళ్లి తంతులో భాగంగా వినోద్ కు ఎకర భూమి, కొంత నగదు, బంగారం రూపంలో కట్నం భారీగానే ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Maharashtra: ఆరుగురు పిల్లల్ని బావిలో పడేసి కసాయి తల్లి దారుణం!
ఇక పెళ్లై రెండేళ్లు గడిచింది. పెళ్లైన నాటి నుంచి ఎంతో సంతోషంగా సాగిన వీరి కాపురంలో ఒక్కసారిగా భార్యాభర్తల నడుమ మనస్పర్ధలు వచ్చి చేరాయి. దీంతో ఒకరిపై ఒకరు దూషించుకునే స్థాయికి చేరుకున్నారు. వీరి వివాదం చినిగి చినిగి చివరికి విడాకుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అనేక సార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టించారు. అయినా వీరి గొడవలకు ఎండ్ కార్డ్ మాత్రం పడలేదు.
కాగా ఇటీవల రవళి భర్తతోనే ఉండేందుకని అత్తింటికి వెళ్లింది. కోడలు రాకను గమనించిన అత్తింటివాళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో రవళి తీవ్ర మనస్థాపానికి గురైంది. చేసేదేం లేక ధైర్యంతో అడుగు ముందుకేసి కాపురానికి తీసుకెళ్లాలంటూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. రవళి సహసాన్ని మెచ్చుకున్న కొందరు స్థానిక కుల సంఘాల నాయకులు ఆమెకు బాసటగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీపీ కూడా రవళికి మద్దతుగా నిలవడంతో ఇరువురు పోలీస్ స్టేషన్ లో సమస్య పరిష్కరించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.