వివాహేతర సంబంధాలకు బలైన కొందరు మహిళలు కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను సైతం లెక్కచేయడం లేదు. ప్రియుడి మైకంలో పడి చివరికి ఎంతటికైన తెగిస్తున్నారు. ఇలా ఓ పెళ్లైన మహిళ భర్తను కాదని అతని స్నేహితుడితో లేచిపోయింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన గుడాల రాజు, చంద్రిక (పేర్లు మార్చాం) ఇద్దరు భార్యభర్తలు. వీరికి గతంలో పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.
అయితే భర్త స్నేహితుడైన వెంకట్ అప్పడప్పుడు రాజుని కలిసేందుకు వారి ఇంటికి వస్తుండేవాడు. అలా వస్తున్న క్రమంలోనే భర్త స్నేహితుడైన వెంకట్ పై చంద్రిక మనసు పారేసుకుంది. ఇక పరిచయం పెంచుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇక రాను రాను వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భర్తలేని సమయంలో శారీరక కోరికలు కూడా తీర్చుకున్నారు. భర్తతో ఉండడం ఇష్టం లేని చంద్రిక ప్రియుడితోనే ఉండాలనుకుంది నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Mahabubnagar: గిన్నెలు కడగమన్న తల్లి.. కోపంతో తలపై బీర్ బాటిల్ తో కొట్టిన కూతురు!
దీంతో అతనితో వెళ్లిపోయేందుకు రంగం సిద్దం చేసుకుని గత నెల 30న పిల్లలతో పాటు ప్రియుడితో లేచిపోయింది. ఇక వెళ్తూ వెళ్తూ.. చంద్రిక ఇంట్లోని నాలుగు తులాల బంగారం, రూ.42 వేలు కూడా తీసుకెళ్లింది. దీంతో భార్య కనపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భర్త ప్రాణస్నేహితుడితో లేచిపోయిన ఇద్దరు పిల్లల తల్లి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.