ప్రియుడితో వ్యవహారాన్ని నడిపిస్తూ చివరికి అడ్డొచ్చిన భర్తను కూడా అంతం చేయాడానికి వెనకాడటం లేదు నేటి కాలం మహిళలు. ఇటీవల అనకాపల్లిలో కాబోయే భర్తను సర్ ప్రైజ్ పేరుతో అతడి గొంతు కోసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన మరువకముందే ఇలాంటిది మరొకటి చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనపర్తిలోని గాంధీనగర్కు చెందిన మేస్త్రీ బాలస్వామి అనే వ్యక్తికి లావణ్య అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కుమారుడు, కూతురు ఉన్నా రు. అయితే మదనాపురం మండలం దంతనూర్కు చెందిన నవీన్ అనే యువకుడికి లావణ్యతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కొన్నాళ్లకి వివాహేతర సంబంధంగా దారితీసింది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఎలాగైన భర్తను వదిలి ప్రియుడితో వెళ్లాలని భార్య పథకం రచించింది.
ఇది కూడా చదవండి: ఇంట్లో ఎవరూ లేరు రా అంటూ మెసెజ్.. పరుగున వెళ్లిన కుర్రాడి కోలుకోలేని షాక్!
ఇక ప్లాన్ లో భాగంగానే ఆ మహిళ కోడిపుంజుతో సరికొత్త నాటకానికి పావులు కదిపింది. అనుకున్నట్లుగానే ఇంట్లో గొడవలు జరుతున్నాయని, స్థానికంగా ఉండే జేరిపోతుల మైసమ్మకు కోడిపుంజును బలివ్వాలని భర్తను నమ్మించింది. ఈ ఏడాది జనవరి 21న అర్ధరాత్రి భర్తను ఒక్కడినే మైసమ్మ ఆలయానికి పంపింది. అప్పటికే వేచి ఉన్న ఆమె ప్రియుడు నవీన్, సుపారీగ్యాంగ్ కురు మూర్తి, గణేశ్ కలిసి బాలస్వామి గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని హైదరాబాద్ లోని బాలాపూర్ సమీపంలో భర్త శవాన్ని పాతిపెట్టింది.
అయితే 5 నెలల క్రితం బాలస్వామి పొలం అమ్మడంతో రూ.30 లక్షలు వచ్చాయి, ఆ డబ్బులు తీసుకుని ప్రియుడితో ఆ మహిళ వెళ్లిపోయింది. దీంతో చాలా రోజులైన అన్న కనిపించకపోవడంతో బాలస్వామి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలస్వామి భార్య లావణ్యను కూడా విచారించారు. ఇక విచారణలో భాగంగా భార్య చేసిన దారుణాన్ని ఒప్పుకుంది. దీంతో వెంటనే పూడ్చి పెట్టిన శవాన్ని తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇక నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.