బాలికలపై నానాటికి అత్యాచారాలు పెరిగిపోతునే ఉన్నాయి. కొందరు వ్యక్తులు వావివరసలు లేకుండా చిన్నారులపై కిరాతకులుగా మారి కోరికలు తీర్చుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ దుర్మార్గుడు చిన్నారికి చాక్లెట్ ఆశచూపి అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అమేతి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన ఓ బాలిక పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉంది. అయితే ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఆ దుర్మార్గుడు అదే బాలికపై కన్నేశాడు.
ఎలాగైన కోరిక తీర్చుకోవాలని భావించి రూ.100 ఆ బాలిక చేతికిచ్చి చాక్లెట్ కొనుక్కో అని చెప్పాడు. ఇక ఆ తర్వాత మళ్లీ వచ్చి మా రూంలో చాక్లెట్ ఉందని నీకు ఇస్తా రా అంటూ ఇంట్లో తీసుకెళ్లాడు. అనుకున్నట్లుగానే ఆ దుర్మార్గుడు ఒంటరిగా ఉన్న ఆ బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చెబితే చంపేస్తానంటూ కూడా బెదిరింపులుగా దిగాడు. దీంతో ఆ బాలిక రక్తపు మరకలతో ఇంటికి పరుగెత్తింది.
ఇది కూడా చదవండి: రెండో పెళ్లి చేసుకున్న భర్త! పక్కా ప్లాన్ తో మొదటి భార్య ఏం చేసిందో తెలుసా?ఏదో జరిగిందని భావించిన ఆ బాలిక తల్లిదండ్రులు చిన్నారిని ప్రశ్నించగా జరిగిన దారుణాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.