Crime News: ఉత్తర ప్రదేశ్లోని బదౌన్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆవులను వధిస్తున్న ముఠా సభ్యుడంటూ ఓ వ్యక్తిని పోలీసులు చిత్రహింసలు పెట్టారు. అనంతరం తాము తప్పుడు వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిసి, అతడి చేతిలో రూ.100 పెట్టి పంపేశారు. పోలీసుల చిత్రహింసల కారణంగా అతడి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని, ఆసుపత్రిపాలయ్యాడు. పోలీసు ఉన్నతాధికారులు, బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, బదౌన్లోని కక్రాలాకు చెందిన ఓ వ్యక్తి కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. మే 2వ తేదీన కొంతమంది పోలీసుల అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆవులను వధిస్తున్న ముఠా సభ్యుడంటూ చిత్ర హింసలు పెట్టారు. అతడి మలద్వారంలో కర్రను దూర్చి, పలు మార్లు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి దారుణంగా ప్రవర్తించారు. రెండు రోజుల పాటు చిత్ర హింసలు పెట్టారు. అయితే, అతడు ఆవులను వధిస్తున్న ముఠా సభ్యుడు కాదని, అమాయకుడని తెలుసుకున్నారు.
చేతిలో రూ. 100 పెట్టి ఇంటికి పంపేశారు. కానీ, పోలీసుల టార్చర్ కారణంగా అతడి మెదడు దెబ్బతింది. ఇంటికి వచ్చిన దగ్గరినుంచి మూర్చరోగం వచ్చిన వాడిలాగా ఊగిపోతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసుల దుశ్చర్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 7గురిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో బాధితుడిపై దాడి జరిగిందని ధ్రువీకరించారు. దాడి చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. బాధితుడికి మెరుగైన చికిత్స అందించే దిశగా ప్రయత్నాలు మొదలుపెడతామని చెప్పారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Five UP cops torture a Muslim man, insert stick in the rectum, give an electric shock UP’s Budaunhttps://t.co/TYmAuQJZfepic.twitter.com/aX13uZE2Xw
— Shuja (@shuja_2006) June 5, 2022
ఇవి కూడా చదవండి : Char Dham Yatra:చార్ ధామ్ యాత్రలో తీవ్ర విషాదం.. లోయలో పడిన బస్సు..