పెద్దల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన దంపతులు.. కష్టం వచ్చినా.. సుఖం వచ్చిన నీకు నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ.. తోడు నీడ గా ఉండాలి. కానీ.. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత ఎక్కడా కనిపించడం లేదు. చిన్న చిన్న విషయాలకు విచక్షణ కోల్పోయి కొట్టుకోవడం.. చంపుకోవడం లాంటివి చేస్తున్నారు. ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు.. భార్యను కరెంట్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆగ్రా లోని అర్సేనా గ్రామానికి చెందిన కుసుమా దేవి, శ్యామ్ బిహారీ భార్యా భర్తలు. ఇద్దరి మధ్య గతకొంతకాలంగా గొడవ జరుగుతున్నాయి. ప్రతిరోజూ బిహారీ తాగి వచ్చి భార్యను విచక్షణారహితంగా కొట్టి హింసించేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. భర్తతో పాటు ఆమె అత్త కూడా బెదిరించేది. ఇక భర్తా, అత్తా పెట్టే హింసలు భరించలేక కుసుమా దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్యామ్ బిహారీ ఆమెను రోడ్డుపై స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టాడు. ఈ దారుణాన్ని అక్కడ ఉన్న గ్రామస్థులు వీడియో తీసి పోస్ట్ చేశారు.
ఈ ఘటనపై స్పందించిన ఆనంద్ కుమార్ షాహి మాట్లాడుతూ.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కనిపించిందని అన్నారు. శ్యాంబిహారి, అతని తల్లి బర్ఫా దేవిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH उत्तर प्रदेश: आगरा में एक पति ने अपनी पत्नी को खंबे से बांधकर डंडे से पीटा। घटना का वीडियो वायरल हुआ। (20.07) pic.twitter.com/ND9CbIo9dP
— ANI_HindiNews (@AHindinews) July 20, 2022
ఇది చదవండి: పరాయి మహిళతో భర్త.. పిల్లలపై కనికరం లేకుండా భార్య!