అక్రమ సంబంధం ఏదో ప్యాషన్ గా మారిన ఈరోజుల్లో.. సక్రమం కాని ఆ సంబంధం వల్ల హత్యలు కూడా బాగానే జరుగుతున్నాయి. వివాహేతర సంబంధం వల్ల మరో ప్రాణం పోయింది. ఓ దివ్యాంగుడు పెట్టుకున్న అక్రమ సంబంధమే అతని ప్రాణాలు తీసింది. భార్య వదిలిపోయిందని.. మరో మహిళకు దగ్గరయ్యాడు. సుఖానికి అలవాటు పడ్డాడు. లేటు వయసులోనూ ఘాటు శృంగారం కావాలని కోరుకున్నాడు. కానీ, అందుకు మహిళ అంగీకరించకపోవడంతో ఒత్తిడి చేశాడు. నా కోరిక తీర్చాల్సిందేనని పట్టుబట్టాడు. చివరికి ఆమె చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ ఘటన నల్గొండ జిల్లా డిండి మండలంలో వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం. జర్పుల చీన్యా(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. పాతికేళ్ల క్రితం అతను విద్యుదాఘాతంలో రెండు చేతులూ కోల్పోయాడు. అతనికి అదే తండాకు చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి శివ అనే కుమారుడు పుట్టాడు. కొన్నాళ్ల తర్వాత కుటుంబ కలహాలతో వారు విడిపోయారు. చీన్యా, కుమారుడు శివ మాత్రమే కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు చీన్యాకు.. అదే తండాకు చెందిన మరో మహిళతో సంబంధం ఏర్పడింది.
వారి మధ్య స్నేహం కాస్తా.. కోర్కెలు తీర్చుకునే దాకా వెళ్లింది. సమయాన్ని బట్టి చీన్యా, ఆ మహిళ తరచూ కులుస్తుండేవారు. వారి బంధం బట్టబయలు అయ్యి.. పెద్దల పంచాయితీ దాకా వెళ్లింది. కానీ, వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మహిళకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. వారి మధ్య బంధం 20 ఏళ్లు దాకా కొనసాగింది. ఆమె తన కుమారుడికి పెళ్లి చేసింది. ఆ తర్వాత వారి అనైతిక బంధాన్ని కొనసాగించలేమని తెగేసి చెప్పింది. అలవాటు పడిన ప్రాణం కావడంతో కాబోలు.. చీన్యా ఆమె మాటను లెక్కచేయలేదు. తన కోర్కె తీర్చాల్సిందేనంటూ పట్టుబట్టాడు. ఎంత చెప్పినా చీన్యా ఎవరూ లేని సమయంలో మహిళ ఇంటికి వెళ్తూనే ఉన్నాడు.
ఇదీ చదవండి: మంచం పట్టిన 87 ఏళ్ల ముసలమ్మపై కామవాంఛ! వీడు మనిషేనా?
చీన్యా ప్రవర్తనతో విసిగిపోయిన ఆ మహిళ అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని తన కుమారుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఎప్పటిలాగానే చీన్యా రాత్రి సమయంలో మహిళ ఇంటికి వచ్చాడు. అప్పటికే అతని రాక కోసం ఎదురుచూస్తున్న ఆమె, కుమారుడు గొడ్డలితో చీన్యాపై దాడికి దిగారు. చీన్యా ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అతడిని వెంటాడి ఇంటికి తీసుకొచ్చి గొడ్డలితో నరికి చంపారు. ఆ తర్వాత ఆ విషయాన్ని గ్రామ సర్పంచ్ కు పండు ఫోన్ చేసి చెప్పారు. ఎంత వద్దని చెప్పినా తన ఇంటికి వస్తుండటంతో ఇలా చేసినట్లు వివరించింది.
సర్పంచ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చీన్యా మరణవార్త తెలుసుకున్న కుమారుడు, బంధువులు అక్కడికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. చీన్యాను తానే గొడ్డలితో నరికి చంపినట్లు ఆ మహిళ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆ మహిళ కుమారుడు మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చీన్యా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.