‘ధర్మేచ..అర్థేచ..కామేచ..మోక్షేచ..నాతి చరామి’ అంటూ పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యే జంట చేసుకునే పెళ్లినాటి ప్రమాణం. అంటే ధర్మంలో, సంపదలో, సంసారిక జీవనంలో, మోక్ష సాధనలో సహధర్మ చారిణితో ఆ నాలుగు ధర్మాలను తప్పి చరించను అని అర్థం. కానీ ఈ మద్య వివాహ బంధానికి మచ్చ తెచ్చే ఎన్నో దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలతో భర్తను భార్య.. భార్యను భర్త దారుణంగా చంపుకుంటున్నారు. మరికొంత మంది భర్తలు భార్యలపట్ల పైశాచికానికి తెగబడుతున్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఓ మహిళపై ఆమె భర్త, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో బాధితురాలి భర్తతోపాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గఢ్కు చెందిన బాధితురాలు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఇండోర్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నా అతడి నిజ స్వరూపం తర్వాత బయట పడింది. తనతో పాటు తన స్నేహితులకు కూడా పడక సుఖం అందించాలని భయపెట్టి.. భార్యను దారుణంగా చిత్ర హింసలకు గురి చేశాడు భర్త.
ఇది చదవండి : 111 ఏళ్ల బామ్మ బర్త్డే సెలబ్రేషన్స్! మరణం ఈమెని మరిచిపోయిందా?
ఇండోర్లోని పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాంహౌస్లో నవంబరు 2019, అక్టోబరు 2021లలో భర్త, అతడి స్నేహితులు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. అంతే కాదు అసహజ రీతిలో తనపై అత్యాచారం చేశారని, ఆపై సిగరెట్లతో రహస్య భాగాల్లో కాల్చి చిత్రహింసలు పెట్టారని ఆరోపించింది. ఎలాగోలా ఫామ్హౌస్ నుంచి తప్పించుకుని ఛత్తీస్గఢ్లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపారు. అయితే నిందితుల్లో ఒకరు ఆమెకు హాని చేయాలనే ఉద్దేశంతో ఆమెను వెంబడించాడని అధికారి తెలిపారు. ఆమె ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో నిందితులు ఐదుగురినీ అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.