సమాజంలో దారుణాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. క్షణికావేశంలో ముందు వెనుక ఆలోచించకుండా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకా కుటుంబాన్ని బాధ పెడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని తన భార్యే అత్యంత క్రూరంగా హత్య చేసింది. కట్టుకున్న వాడు అని కూడా చూడకుండా మర్మాంగాన్ని కోసేసింది. అంత అయ్యాక.. ‘అయ్యో నా మొగుడా’ అంటూ ఏడవసాగింది. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి : కన్నతల్లిని కాలితో తన్నిన కసాయి కొడుకు.. వీడియో వైరల్!
ఆ వివరాలు.. 38 ఏళ్ల జితేంద్ర రామ్ అనే వ్యక్తి ఉత్తరాఖండ్, పితోరాఘర్ పరిధిలోని, కోట్లి పట్టి డింగాస్ గ్రామంలో..భార్య, కూతురితో కలిసి నివసించేవాడు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన జితేంద్ర నిత్యం తాగొచ్చేవాడు. అర్ధరాత్రి ఇంటికి చేరుకొనే జితేంద్ర నిత్యం భార్యతో గొడవ పెట్టుకునేవాడు. అలానే ఘటన జరిగిన రోజు పని ముగించుకుని అర్థరాత్రి ఇంటికి చేరుకున్నాడు. భార్య సునీతాదేవి (35)తో వాగ్వాదానికి దిగాడు. దీంతో కలత చెందిన ఆమె.. గాఢనిద్రలో ఉన్న తన భర్త జితేంద్రరామ్ ప్రైవేట్ భాగాన్ని (మర్మాంగాన్ని) బ్లేడుతో కోసేసింది. ముందుగా భర్త ప్రైవేట్ పార్టును కోసి.. ఆపై తాడుతో గొంతుకోసి హత్య చేసింది.
ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చుసిన వారి కుమార్తె ఈ విషయాన్ని తన మామకు తెలిపింది. జితేంద్ర సోదరుడి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన బ్లేడు, తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం మహిళను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.