కామారెడ్డి- ఓ యువకుడు, మరో వివాహిత చనువుగా ఉండటం చూడటమే ఆ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం, ఏ మాత్రం సంబంధంలేని ఓ బాలుడిని బలి తీసుకుంది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సంచలనం రేపిన పదేళ్ల బాలుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహితతో చనువుగా ఉండడం చూశాడని, ఎవరికైనా చెబితే పరువు పోతుందని భావించి బాలుడిని అతి దారుణంగా పొడిచి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఇక్కడ ఆసక్తికరమైన మరో అంశం ఏంటంటే.. ఈ నేరానికి పాల్పడింది కూడా ఓ మైనర్. వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న టీనేజ్ యువకుడు.. అది చూశాడని సదరు బాలుడిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నాగిరెడ్డిపేట్ మండలం మాసంపేట, తాండూరు గ్రామాల సమీపంలో పదేళ్ల బాలుడు సురేష్ ఈనెల 6న దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు బాలుడి కడుపులో పొడిచి అతి కిరాతకంగా చంపేశారు. బాలుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిండచంతో వాళ్లు రంగ ప్రవేశం చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ మైనర్ ని విచారించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.
అదే గ్రామానికి చెందిన టీనేజ్ యువకుడికి, ఓ వివాహితతో అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో ఇద్దరూ సన్నిహితంగా ఉన్న టైంలో సురేష్ అనుకోకుండా వారిని చూశాడు. అలా వారిని చూసిన విషయాన్ని ఈ టీనేజ్ యువకుడి తండ్రికి చెబుతాననడంతో భయపడ్డాడు. దీంతో తమ అక్రమ సంబంధం వ్యవహారం బయట పడుతుందేమోనన్న అనుమానంతో బాలుడుని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం జామకాయలు తెంపుకొద్దామని చెప్పి టీనేజ్ యువకుడు సురేష్ని పిలిచాడు. అతన్ని సైకిల్ పై ఎక్కించుకుని తాండూర్ సమీపంలోకి తీసుకెళ్లి దారుణానికి హత్య చేశాడు. యువకుడు సురేష్ని సైకిల్ పై ఎక్కించుకుని తీసుకెళ్లడం గ్రామస్తులు చూడడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో టీనేజ్ యువకుడు బాలుడిని హత్య చేసిన విషయాన్ని ఒప్పకున్నాడు.