ప్రేమ ఒక తియ్యని అనుభూతి.. ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడక మానరు. కానీ, కొందరు మాత్రం ఆ ప్రేమను అవసరాల కోసం, కోరుకున్నది దక్కించుకోవడానికి వాడుకుంటుంటారు. అలా ప్రేమ పేరుతో మోసపోయిన ఎందరో ఉన్నారు. కొందరు పంతానికి మోసం చేసినవాడిని పెళ్లాడి నానా ఇక్కట్లు చూశారు. ప్రేమించాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పిడిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ యువతి కూడా అలా మోసపోయిందనే బాధతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ రామ్ నగర్ కు చెందిన వాసర్ల అనూష(22) హైదరాబాద్ లోని ఓ ప్రేవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె మధురానగర్ లోని జి-బ్లాక్ లో ఒంటరిగా ఉంటోంది. శనివారం ఆమె ఆఫీసుకు రాలేదని కొలీగ్స్ ఏమైందో తెలుసుకుందామని ఫోన్ చేశారు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆరోగ్యం బాలేదోమో అని చూసేందుకు సాయంత్రం ఇంటికి వెళ్లారు. తలుపు లోపలి వైపు నుంచి లాక్ చేసి ఉంది. కిటికీ లో నుంచి చూడగా అనూష సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఉంది. వెంటనే తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు.
అనూషను కిందికి దించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్య చేసుకుంది. నవీన్ అనే వ్యక్తిని తాను ప్రేమించినట్లు ఆ లేఖలో రాసింది. ఆ వ్యక్తి ఆమెను మోసం చేసినట్లు అనూష పేర్కొంది. తనని మోసం చేసిన నవీన్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలిపింది. ఆ విషయాన్ని కొలీగ్స్ ఆమె సోదరుడు అవినాష్ కు తెలియజేశారు. అతను హైదరాబాద్ చేరుకుని అనూష ఆత్మహత్యకు నవీన్ అనే వ్యక్తి కారణమని ఫిర్యాదు చేశాడు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రేమించే సమయంలో అన్నీ కరెక్టే అనిపిస్తాయి. మనం ప్రేమిస్తున్న వాళ్లు మంచివారే అని నమ్ముతాం. కానీ, ఎంత ప్రేమ ఉన్నా ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. నమ్మిన వాళ్లు మోసం చేశారంటూ ఇలా ప్రాణాలు తీసుకోకూడదు. ప్రతి ప్రేమ పెళ్లిగా మారాలని లేదు.. మారదు కూడా. కానీ, ప్రేమలో విఫలమైన ప్రతి ఒక్కరు ప్రాణాలు తీసుకోవాలని ఎక్కడా లేదు. మిమ్మల్ని ప్రేమించే వారికోసం బ్రతకడం అలవాటు చేసుకోవాలి. కన్నవారి కలలను సాకారం చేయడం కోసం జీవితాన్ని కొనసాగించాలి. ప్రేమలో విఫలమైతే చావు ఒక్కటే మార్గమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.