హైదరాబాద్ లో స్పా, సెలూన్ ముసుగులో అత్యాచారం జరుగుతున్న ఘటనలు అడపాదడప వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొందరు ఇళ్లలోనూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగిస్తున్నారు. అలాంటి ఓ ముఠానే పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఓ ఇంటిపై దాడిచేసి మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
పోలీసుల వివరాల ప్రకారం.. జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి బాలాజీనగర్ లోని శివాజీనగర్ లో ఆరుగురు సభ్యుల ముఠా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నారు. పక్కా సమాచారంతో ఆ ఇంటిపై దాడిచేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాకాపురం ప్రసాద్(32), బాకాపురం జ్యోతి(35), వానరుల సాయికిషోర్(25), దవర్లాల్(30), భవాని(40), భాగ్యలక్ష్మి(30)లను పోలీసులు రిమాండ్ కు తరలించారు.