ప్రేమ అనే రెండు అక్షరాలను అడ్డు పెట్టుకుని ఎందరో యువకులు అరాచకాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తమ కోరికలు తీర్చుకోవడానికి ఆ బంధాన్ని ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు. అలా ఓ యువకుడు తాను ప్రేమిస్తున్నానంటూ మాటలతోనే కాదు లైంగికంగా కూడా వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. ఆమెను ఎంతగా టార్చర్ పెట్టాడంటే ఆఖరికి ఆ యువతి ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్లింది. నాలుగురోజులు మృత్యువుతో పోరాటి చివరిక కన్నుమూసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం శానంపూడి గ్రామానికి చెందిన పులుకూరి శ్రావణి(19) ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే తల్లికి చేదోడుగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన చెన్నంశెట్టి నాగేంద్రబాబు ప్రేమ పేరుతో తరచూ శ్రావణిని లైంగికంగా వేధింపులకు గురిచేయడం చేస్తున్నాడు. ఉండేకొద్దీ నాగేంద్రబాబు చేష్టలు హద్దులు దాటుతున్నాయి. ఆ విషయం శ్రావణి తండ్రికి తెలిసింది. ఆమెను వెంటనే ప్రకాశం జిల్లా అద్దంకి మండలం యంపరాలలోని బావమరిది ఇంటికి పంపాడు.
విషయం తెలుసుకున్న నాగేంద్రబాబు స్నేహితులతో కలిసి యంపరాల వెళ్లి యువతిని ఇబ్బంది పెట్టసాగాడు. ఆమెను తండ్రి తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో శ్రావణి తండ్రిపై నాగేంద్రబాబు దాడి చేశాడు. అంతేకాకుండా వారి కుటుంబం మొత్తాన్ని హత్యచేస్తానంటూ హెచ్చరించాడు. కొన్నిరోజులుగా జరుగుతున్న విషయాలతో శ్రావణి విసిగిపోయింది. నాగేంద్రబాబు మరీ హద్దులు దాటడంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్యకు యత్నించింది.
ఇదీ చదవండి: సోదరుడితో కలిసి భార్యపై భర్త దారుణం! తల నరికి మరీ..
ఘర్షణ జరిగిన తర్వాతి రోజు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను వినుకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నాలుగురోజులు మృత్యువుతో పోరాడింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నరసరావుపేట తరలిస్తుండగా మార్గం మధ్యలో తుది శ్వాస విడిచింది. తండ్రి ఫిర్యాదు మేరకు నాగేంద్రబాబు, పత్తి శ్రీనివాసరావు, అనిల్ పై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.