గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అత్యంత ధనిక దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఇక్కడి రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. ఏ దేశాల్లో లేని కఠిన శిక్షలు అక్కడ ఉంటాయి. నేరం చేయడానికి కూడా భయపడేంతా దారుణంగా ఉంటాయి అక్కడి శిక్షలు. తాజాగా ఒకే రోజు 81 మందిని సామూహికంగా ఉరితీసింది అక్కడ ప్రభుత్వం. ఇంత మందిని ఒకేసారి ఉరి తీయడం వెనుక కారణం ఏంటీ? ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..
సౌదీలో నేరం చేసిన వారికి శిక్ష తప్పదు. ఎంత పెద్ద వాళ్లు అయినా తప్పు చేస్తే కటకటలు లెక్కించాల్సిందే. అలా అనేక నేరాలు, అత్యంత క్రూరంగా ప్రవర్తించిన నేరస్తుల పట్ల సౌదీ అరేబియా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. 81మందిని ఒకేసారి ఉరి తీస్తూ ప్రపంచ దేశాలను షాక్ చేసింది. పిల్లలు, ఆడవాళ్లు, అమాయకుల్ని అత్యంత క్రూరంగా చంపిన వారికి ఈ శిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. అంతేకాదు.. మిలిటెంట్ గ్రూప్లకు చెందిన టెర్రరిస్టులకు కూడా ఇదే శిక్ష విధించింది. ఉరివేసిన 81మందిలో 73మంది సౌదీకి చెందిన సామాన్యులే ఉండగా.. మిగిలిన వాళ్లలో ఏడుగురు యెమెన్ వాసులు, ఒకరు సిరియాకి చెందిన పౌరుడు ఉన్నారు.
అయితే ఈ ఉరి శిక్షలపై సౌదీ ప్రభుత్వం స్పందించింది. నేరస్తులు చేసిన తప్పులు క్షమించలేని విధంగా ఉండటం వల్ల మరణశిక్ష విధించినట్లు స్పష్టం చేసింది. అలాంటి వారిని వదిలేస్తే.. మరింత మంది ప్రాణాలు తీస్తారని.. వారిలాగే మరికొందరిని తయారు చేస్తారని చెప్పింది. కామన్. ఇలా ఒకే సారి చాలా మందిని ఉరి తీయడం రెండో సారి. మొదటి సారి 2016 సంవత్సరంలో 47మందిని ఉరితీశారు. ఇదిలా ఉంటే చట్టం పేరుతో సౌదీ అరేబియా ప్రభుత్వం బలవంతంగా ప్రాణాలు తీస్తుందని.. తప్పు చేసిన వారికి ఓ అవకాశం ఇస్తే ఏమవుతుందని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి.మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.