కొందరు అమ్మయిలు బయటేమో ఏం తెలియనట్టు నటిస్తూ లోపల అసలు రూపాన్ని దాచిపెడుతుంటారు. ఇలా ఎంతో మంది యువతులు అసలు రూపాన్ని సమయమొచ్చినప్పుడల్లా బయటకు తీస్తూ ఊహించని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా బరితెగించిన ఓ యువతి అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసింది. ఇంతటితో ఆగకుండా పని చేస్తున్న సంస్థను నిండా ముంచింది. అసలు ఏం జరిగిందనేదే కదా మీ డౌట్?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్రవంతి అనే యువతి గత ఐదేళ్లుగా తిరుపతిలోని శ్రీకాళహస్తిలో ఫిన్ కేర్ సంస్థలో మేనేజర్ కమ్ అప్రైజర్ గా విధులు నిర్వర్తిస్తుంది. కొంత కాలం ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకున్న స్రవంతి రోజులు గడిచే కొద్ది ఆమె ఆలోచనల్లో మార్పొచ్చింది. పని చేస్తున్న కంపెనీనే గోల్ మాల్ చేసి అక్రమంగా సంపాదించాలనే ఆలోచనలకు కలిగాయి. ఇక అనుకున్నదే తడువుగా వెంటనే ఆ ఆలోచనలను అమలు చేస్తూ ఊహించని మోసానికి పాల్పడింది.
ఇది కూడా చదవండి: అమ్మాయిని నమ్మించి.. తండ్రి కొడుకు కలిసి దారుణం! 24 గంటల తర్వాత అసలు కథ!
అలా ఏర్పడిన వారి పేర్లపై నకిలీ బంగారాన్ని పెట్టి డబ్బులు తెచ్చుకునేది. ఇలా కొంత కాలం గుట్టుచప్పుుడు కాకుండా నడిపించిన ఆమె బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లింది. అయితే తాను తాకట్టు పెట్టిన అసలైన బంగారాన్ని విడిపించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తన స్నేహితులతో చేతులు కలిపి దోపిడీ జరిగినట్లుగా నాటకమాడాలనుకుంది. అయితే చివరికి ఈ నాటకం అంతా సక్సెస్ కాకపోవడంతో స్రవంతి అసలు రంగు బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్రవంతితో పాటు ఆమె వెనకున్న గ్యాంగ్ ను కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.