ఓ భార్యాభర్తలకు గతంలో వివాహం జరిగింది. ఉన్నదాంట్లో సంతోషంగా సాగుతున్న కాపురం. ఇక పిల్లలతో వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన భార్య పుట్టింటికి వెళ్తున్నానని భర్తకు చెప్పి వెళ్లింది. నిజమేననుకుని భర్త నమ్మాడు. కట్ చేస్తే భార్య పుట్టింటికి వెళ్లలేదని తెలిసుకున్న భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
తాజాగా ఇదే ఘటన తాండూరులో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తాండూరు మండలం కొత్లాపూర్ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన అతియ పర్వీన్, ఎండీ పాషా దంపతులు. వీరికి అఫియానాజ్, జోయ తసి ఖాన్ అనే ఇద్దరు కూతుళ్ల ఉన్నారు. భర్త కూలీ పనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకుంటు వచ్చేవాడు. కాగా ఏప్రిల్ 24న భార్య పర్వీన్ పుట్టింటికి వెళ్తానని భర్తకు చెప్పింది.
ఇది కూడా చదవండి: Chennai: టీవీ చూడొద్దన్న తల్లి..! కూతురు చేసిన పనికి అంతా షాక్!
దీంతో భర్త సరే అనడంతో ఇద్దరు కూతుళ్లను తీసుకుని తల్లిగారి ఊరైన కర్ణాటక రాష్ట్రం పెద్ద ఐనెల్లి గ్రామానికి బస్సులో వెళ్లింది. అయితే మరుసటి రోజు భార్య వెళ్లిందా లేదనే విషయాన్ని భర్త తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఫోన్ చేసి అడగడంతో ఇక్కడికి రాలేదని అత్తామామలు చెప్పారు. దీంతో భర్త ఒక్కసారిగా షాక్ కు గురైన భర్త ఖంగారు పడ్డారు.
ఏం చేయాలో తెలియక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా తాండూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. పర్వీన్ ను ఎవరైన కిడ్నాప్ చేశారా? లేక మరేదైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.