తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేయలేదన్న కోపంతో కుమారుడు కన్న తండ్రిని దారుణంగా హత్య చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడలూరు జిల్లా పాళయంకోటలోని కీళ్పాది ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన లూర్థుసామి అనే వ్యక్తికి ముగ్గురు కుమారులు. అయితే పెద్ద కుమారుడైన జాన్సన్ నిరక్షరాస్యుడు. సినిమాలు, షికారులు అంటూ తాగుడుకు బానిసై జులాయిగా తిరిగేవాడు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: భర్త ఇంట్లో బాత్ రూం లేదని కొత్త పెళ్లికూతురు ఆత్మహత్య!
అయితే జాన్సన్ ఇటీవల అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇక వస్తూ వస్తూనే తనకు పెళ్లి చేయాలంటూ తండ్రితో గొడవకు దిగాడు. ఇదే విషయమై తండ్రీకొడుకుల మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. అయితే తండ్రీకొడుకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కొడుకు జాన్సన్ కోపంతో తండ్రి తలపై బలంగా బండరాయితో బాది ఇంట్లో నుంచి పరారయ్యాడు.
ఇక రక్తపు మడుగులో పడి ఉన్న లూర్థుసామిని స్థానికులు గమినించి ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ లూర్థుసామి మంగళవారం మరణించాడు. ఇటీవల జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.