ఓ తల్లి కన్నకూతురిపై ఊహించని రీతిలో దారుణానికి పాల్పడింది. ఎన్నో ఏళ్లుగా కూతురిని హింసిస్తూ తన ప్రియుడితో కలిసి అత్యాచారం చేయించటమే కాకుండా తన కూతురి నుంచి అండసేకరణ చేపట్టి అక్రమ సరోగసి కోసం ఆస్సత్రులకు అమ్మిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే..తమిళనాడులోని ఈ రోడ్కు చెందిన ఓ మహిళ (33) భర్తకు దూరంగా కూతురితో పాటు నివాసం ఉంటుంది. అలా కొంత కాలం మహిళ కూతురితో ఉంటూ కాలాన్ని వెల్లదీస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఆ మహిళ పరాయి మగాడి ఉచ్చులో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది. అలా కొన్నేళ్ల పాటు ఈ దుర్మార్గురాలు గుట్టుచప్పుడు కాకుండా తెర వెనక సంసారాన్ని నడిపిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ మహిళకు దారుణమైన ఆలోచన పుట్టింది.
ఇది కూడా చదవండి: Late Night Party: లేట్ నైట్ పార్టీ.. నడిరోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు
తన ప్రియుడితో కలిసి కన్న కూతురిపై అత్యాచారం చేయించింది. ఇంతటితో ఆగకుండా ఏకంగా కూతురి నుంచి అండసేకరణ చేపట్టి ఆస్పత్రుల్లో అమ్మకానికి పెట్టింది. ఇది చాలదు అన్నట్లుగా కూతురి వయసును ఆధార్కార్డులో మార్పించేసి మరీ ఈ దందాకు పాల్పడుతూ వచ్చింది. అలా ఐదేళ్లుగా ఆ మహిళ తన కూతురిపై ఇంతటి దుర్మార్గానికి పాల్పడింది. ఈ దారుణమైన చర్యను తట్టుకోలేని కూతురు తల్లి చెరు నుంచి బయటపడింది.
జూన్ 1వ తేదీన తల్లి వేధింపులను భరించలేక బాధితురాలు ఇంటి నుంచి పరారైసేలంలోని తన స్కూల్ స్నేహితురాలి ఇంట్లో కొన్ని రోజులు తలదాచుకుంది. ఇక అనంతరం బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్సో యాక్ట్, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి, ఆధార్ను మార్పిడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.