సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. మాతానగర్కు చెందిన ఓ యువతి ఈ నెల 15న రాత్రి 9.30 గంటల సమయంలో బయటకు వెళ్లింది. ఇక ఇదే అదనుగా భావించిన గౌస్, సాయిరాంరెడ్డి అనే యువకులు యువతపై కన్నేశారు. ఇక ముత్యాలమ్మవీధిలో ఆ యువతిని ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూల్డ్రింక్ తీసుకుని అందులో మత్తు మందు కలిపి బలవంతంగా తాగించారు.
ఇది కూడా చదవండి: కూతురు వెంటపడుతున్న యువకుడు.. తండ్రి షాకింగ్ డిసిషన్!
దీంతో మత్తులోకి జారుకున్న ఆ యువతిని ఇంట్లో బందించి అత్యాచారం చేశారు. అలా మూడు రోజుల పాటు ఆ యువతికి నరకం చూపించారీ దుర్మార్గులు. ఇక యువతి అరుపులు,కేకలు వేయడంతో పక్కంటివాళ్లు పరుగు పరుగున వచ్చారు. దీంతో స్థానికుల రాకను గమనించిన దుండగులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.