Software Woman: వరకట్న వేధింపుల కారణంగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరంలోని నటరాజ్ కాలనీకి చెందిన బి.భార్గవ్ అనే వ్యక్తికి ఇందిరానగర్కు చెందిన నిర్మలతో 2020 డిసెంబర్లో నెలలో పెళ్లయింది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. కరోనా టైం నుంచి ఇంటి దగ్గరినుంచే పనిచేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి భర్త భార్గవ్ నిర్మలను అదనపు కట్నం పేరుతో వేధిస్తున్నాడు. ఇంటి దగ్గరినుంచి 5 లక్షల రూపాయలు తీసుకురావాలని హింసించటంతో రెండు లక్షలు తెచ్చిచ్చింది.
అయినా అతడి వేధింపులు తగ్గలేదు. మిగిలిన రెండు లక్షల రూపాయలు కూడా తీసుకురమ్మని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిర్మల ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. శనివారం గదిలోని ఫ్యాన్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాసుపత్రికి తరలించారు. నిర్మల తండ్రి లక్ష్మణ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమ అల్లుడే కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని నిర్మల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అమ్మాయిని నమ్మించి.. తండ్రి కొడుకు కలిసి దారుణం! 24 గంటల తర్వాత అసలు కథ!