ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు రూపొందించినా దారుణాలు మాత్రం అస్సలు ఆగడం లేదు. అడ్డూ అదుపు లేకుండా కొందరు ఊహించని రీతిలో దారుణాలకు తెగబడుతున్నారు. సత్యసాయి జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్ల కిందట వివాహమైంది.
ఏడు నెలల క్రితం ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇక పది రోజుల కిందట ఆ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. సోమవారం ఉదయం బాబును తోడికోడలకు అప్పగించి బహిర్భూమికి వెళ్లింది. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు దుర్మార్గులు కాపు కాశారు. ఇక ఒంటరిగా ఉన్న ఈ బాలింతపై అత్యాచారం చేశారు. ఇంతటితో ఆగకుండా తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేసి పరారయ్యారు.
ఇది కూాడా చదవండి: NTR District: భర్తను కాదని ప్రియుడికి జై కొట్టిన భార్య.. చివరికి జరిగింది ఇదే!
పసి బిడ్డను వదిలి బయటకు వెళ్లిన తల్లి ఇంకా ఇంటికి రాకపోయేసరికి అందరూ ఖంగారు పడ్డారు. వెంటనే గ్రామంలో అటూ ఇటూ అంతటా వెతికారు. చివరికి ఓ పొదలో రక్తంతో తడిసి శవంగా పడిఉన్న ఆ తల్లిని చూసిన వారి బంధువుల గుండెలు తల్లడిల్లాయి. ఇక కన్నీరు మున్నీరుగా విలపించి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యలో బంధువుల ప్రమేయం కూడా ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.