మహిళా అధికారి అంటే సంఘంలో నలుగురికి స్ఫూర్తిగా ఉంటూ ఉద్యోగ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మరీ ముఖ్యంగా విజిలెన్స్ సంస్థలో అంటే సమాజంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ ప్రజలకు న్యాయాన్ని అందించాలి. కానీ అలాంటి సంస్థలో పని చేసే ఓ మహిళా అధికారి వీటికి భిన్నంగా వ్యవహరిస్తూ సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇదే వార్త రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పేరు మానసి జెనా. ఒడిశా రాష్ట్రంలో విజిలెన్స్ ఇనస్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే ఉద్యోగ విధుల్లో ఉన్న మానసి జెనా ఇటీవల ఓ నిందితుడు అవినీతి కేసులో దొరికిపోయాడు. ఇదే అదునుగా భావించిన ఈ మహానటి జెనా నిందితుడితో మాట్లాడుతూ.. నీపై నమోదైన కేసును కొట్టివేస్తానని, దీనికి పరిహారంగా నాకు రూ.20 లక్షలు చెల్లించాలని సూచించింది. దీనికి గనకు నిరాకరిస్తే నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు గురి చేసింది.
దీంతో భయపడి పోయిన ఆ నిందితుడు జెనా కోరినట్లుగానే సహకరించాడు. కాగా జెనా తోటి ఉద్యోగి ఆధ్వర్యంలో రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. ఈ వ్యవహారాన్ని ముందే పసిగట్టిన విజిలెన్స్ అంతర్గత వర్గం అధికారులు మానసి జెనాను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వెంటనే స్పందించారు ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) సునీల్కుమార్ బన్సాల్. రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ఇనస్పెక్టర్ మానసి జెనాను విధుల నుంచి బర్తరఫ్ చేసినట్లు సునీల్కుమార్ బన్సాల్ శుక్రవారం ప్రకటించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.