నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని 108 సిబ్బందిని కోరగా నిబంధనలు వర్తించవంటూ తేల్చి చెప్పారు. దీంతో తండ్రి కుమారుడి మృతదేహాన్ని బైక్ పై ఇంటికి తీసుకెళ్లాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికులకు కన్నీరును తెప్పిస్తుంది. అసలు ఏం జరిగిందంటే?
ఇది కూడా చదవండి: Hyderabad: రాష్ట్రంలో మరో పరువు హత్య.. నడిరోడ్డుపై భార్య ముందే దారుణం!
అది ఏపీలోని నెల్లూరు జిల్లా సంగం ప్రాంతం. శ్రీరామ్, ఈశ్వర్ అనే ఇద్దరు స్నేహితులు కనిగిరి జలాశయంలోని ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి మరణించారు. అయితే శ్రీరామ్ ను నీటిలోంచి బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ బాలుడు అప్పటికే మరణించాడని డాక్టర్లు ద్రువీకరించారు. దీంతో శ్రీరామ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి 108 వాహనానికి కాల్ చేశాడు. నిబంధనలు వర్తించవని సిబ్బంది రావడానికి నిరాకరిచారు.
దీంతో శ్రీరామ్ తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తన వద్దనున్న బైక్ పై తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ అమానవీయ ఘటన చూసిన స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. తండ్రి కుమారుడి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.