ప్రేమ.. వయసుతో సంబంధం లేదు. ప్రాంతం, భాషతో అస్సలే సంబంధం లేదు. ఇద్దరు మనుషులు, వారి మనసులు ఏకమై ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. చివరికి ఒకరిపై ఒకరికి మన్పర్ధలు రావడం, తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, బ్రేకప్ చెప్పుకోవడం వంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
నేటి కాలంలోని కొందరు మైనర్లు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా ప్రేమ పేరుతో విచ్చల విడిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా ఇటీవల ఓ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. దీంతో అప్పటికే విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు మందలించడంతో ఆ మైనర్ జంట మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా నంద్యాల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..కృష్ణగిరి మండలం అలంకొండ గ్రామానికి చెందిన బోయ ప్రసాద్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం చదువుమానేసి గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన చాకలి అనిత (16)కి ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అలా వీరి ప్రేమ రోజులు గడిచి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక కొన్ని రోజుల తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
ఇది కూడా చదవండి: Medchal: ప్రేమలో పడ్డ 9వ తరగతి విద్యార్థులు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు, కానీ!
అయితే ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ కుటుంభికులు అతనికి రెండు నెలల క్రితం అతని సొంత అక్క కూతురుతో వివాహం జరిపించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్, అనిత మంగళవారం మల్యాల గ్రామం సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి అత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ మరణించడంతో మృతుల తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీరి మరణంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.