హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో 38 కాపర్ బండిల్స్ కనిపించకపోవడంతో అధికారులు షాకు గురయ్యారు. ఏం జరిగిందా అని తెలుసుకునేలోపే దొంగతనం జరిగిందని ప్రాజెక్ట్ అధికారులు గుర్తించారు. అయితే దీనిపై వెంటనే స్పందించారు ప్రాజెక్ట్ మేనేజర్ సురేశ్ క్రిష్ట.
ఏం జరిగిందని పలువురు ప్రాజెక్ట్ అధికారులతో చర్చించారు. ఈ 38 కాపర్ బండిల్స్ విలువ సుమారుగా లక్షల్లో ఉంటుందని సిబ్బంది అంచనా వేస్తున్నారు. వీటిని ఎవరైన దొంగతనం చేశారా? అనే అనుమానం రావడంతో ప్రాజెక్ట్ మేనేజర్ సురేశ్ క్రిష్ట బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్ట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. స్థానిక సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పొలీసులు.
ఇది కూడా చదవండి: New Jersey: వీడియో: నగల దూకాణంలో దొంగల ముఠా హల్చల్.. తుపాకులతో బెదిరించి!ఈ చోరీ నిజంగానే జరిగిందా లేక నిర్మాణంలో భాగంగా ఉపయోగించాక లెక్కకు అందడం లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రాన్ని భద్రతగా చూడాల్సిన పోలీస్ కంట్రోల్ సెంటర్ లోనే ఈ భారీ చోరీ జగరగడం ఏంటని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భద్రతగా చూడాల్సిన పోలీస్ కంట్రోల్ రూంలోనే ఈ భద్రత లేకపోవడం అనేది అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఈ భారీ చోరిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.