ఆమె పేరు ఉష.. వయసు 23 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ పార్వతీపురానికి చెందిన ఈ యవతికి మెదక్ టౌన్కి చెందిన రాఘవేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం రాను రాను స్నేహంగా మారడంతో చివరికి ప్రేమగా రూపాంతరం చెందింది. ఇక ఒకరి మనసులు ఒకరు అర్ధం చేసుకుని చివరికి ప్రేమించుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న ఈ జంట కొన్నాళ్ల తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
అయితే ఇద్దరివి వేర్వేరు సామాజికవర్గాలు కావడంతో పెద్దలు వీరి ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో ఇద్దరు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాక ఎలాగైన ఇద్దరి తల్లిదండ్రులును ఒప్పించాలని భావించి పట్టుపట్టి ఎదురించి మరి చివరికి ఒప్పించారు. ఇక పెద్దల ఇష్టం మేరకు ఇదే నెల 11వ తేదిన హైదరాబాద్లో ఓ హోటల్లో వీరి వివాహాన్ని గ్రాండ్గా నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Hyderabad: పెళ్లైన 6 నెలలకే బయటపడ్డ భర్త భాగోతం.. తట్టుకోలేక వైద్యురాలు ఏంచేసిందంటే..?పెళ్లై దాదాపు 15 రోజులు అవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే నవ వధువు ఉషకు తలలో నొప్పిగా ఉంటే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.ఉషకు అన్ని వైద్య పరీక్షలు చూసిన డాక్టర్లు తట్టుకోలేని వార్తను వారి మందు ఉంచారు. ఉషకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఆమె బతకడం చాలా కష్టం అంటూ నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భర్త రాఘవేంద్ర తో పాటు ఉష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇక చివరికి ఉష డాక్టర్లు చెప్పినట్లే ప్రాణాలు విడిచింది. దీంతో పెళ్లై నెల 18 రోజులకే భార్య చనిపోవడంతో భర్త రాఘవేంద్ర కన్నీటి సంద్రంలో మునిగిపోయాడు. ప్రేమించి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నా.. కనీసం కోరుకున్న వ్యక్తితో నెల రోజులు కూడా ఉండకుండా భర్తను ఒక్కడిని చేసి అందని లోకాలకు వెళ్లిపోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా అందరినీ తీవ్రంగా బాధించింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.