crime news : ఎంత చెప్పినా వినకుండా భార్యతో చనువుగా ఉంటున్నాడనే కోపంతో ఓ యువకుడిని హత్య చేశాడో వ్యక్తి. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా, నడిమిపల్లె గ్రామానికి చెందిన బాల చెన్నయ్య, శివ కుమారి భార్యాభర్తలు. అదే గ్రామానికి చెందిన పుప్పాల సత్య నారాయణ శివ కుమారితో గత కొంతకాలంగా చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం చెన్నయ్యకు తెలిసింది. దీంతో అతడు సత్యనారాయణను హెచ్చరించాడు. భార్యకు దూరంగా ఉండాలన్నాడు. అయితే, చెన్నయ్య మాటలను సత్యనారాయణ లెక్కపెట్టలేదు. ఈ నెల 6వ తేదీన కూడా శివ కుమారితో చనువుగా ఉన్నాడు.
ఇది చూసిన చెన్నయ్య రగిలిపోయాడు. సత్య నారాయణను అడ్డు తొలిగిస్తేనే తన కాపురం చక్కబడుతుందని బంధువుల వద్ద వాపోయాడు. 7వ తేదీ బంధువులతో కలిసి పూల తోటకు పోయి వస్తున్న సత్యనారాయణపై దాడి చేశాడు. గాయాలపాలైన సత్యనారాయణను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు బోనం బాలచెన్నయ్యతోపాటు అతనికి సహకరించిన బోనం చిన వీరయ్య, బోనం శివకుమారి, బోనం వెంకట లక్ష్మి, బోనం అంకమ్మ, పుప్పాల అంకమ్మ, పుప్పాల వెంకటేశ్వర్లు, పార్శపు హనుమంతును బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పెళ్లై 20 రోజులు.. మరిదిని ప్రేమించింది.. అందరూ షాక్ అయ్యేలా..
పోర్న్ చూసి రెచ్చిపోయారు.. పొలంలోని బాలికలపై..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.