ఈ మథ్య కాలంలో చిన్న చిన్న కారణాలకు కొందరు క్షణికావేశంలో ఊహించని రీతిలో దారుణాలకు తెగబడుతున్నారు. చీర కొన్నివ్వలేదని, సినిమాకు తీసుకెళ్లలేదని ఇలాంటి చిన్న చిన్న కారణాలకు హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు అనేకం చూస్తున్నాం. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ కూతురు తల్లి గిన్నెలు కడగమన్నదనే కోపంతో తల్లిపై దాడికి యత్నించింది. ఈ దాడి ఘటనలో ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మహబూబ్ నగర్ జిల్లా తిమ్మసానిపల్లి ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన మోహిన్ భేగం అనే బాలిక తల్లి నజ్మాభేగంతో కలిసి ఉంటుంది. అయితే గిన్నెలు కడగాలని తల్లి కూతురికి చెప్పింది. దీంతో కూతురు ససేమిరా అనడంతో తల్లికి కోపం చిర్రెత్తుకొచ్చింది. దీంతో కూతురిని ఓ దెబ్బ కొట్టింది. ఇక కూతురి కోపం ఒక్కసారిగా పడగ విప్పింది.
ఇది కూడా చదవండి: Satya Sai district: దారుణం: బాలింతపై సామూహిక అత్యాచారం, ఆపై హత్య!
వెంటనే ఇంట్లో ఉన్న బీర్ బాటిల్ చేత బట్టి తల్లి తలపై బలంగా బాదింది. ఇంతటితో ఆగని ఆ కూతురు తల్లి కళ్లలో కారం చల్లి విచక్షణ రహితంగా దాడికి తెగబడింది. దీంతో వెంటనే గమనించిన స్థానికులు తల్లిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక తల్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.