అది మధ్యప్రదేశ్ లోని రీవా. ఇదే ప్రాంతానికి చెందిన 63 ఏళ్ల వ్యక్తి గతంలో ఆరోగ్యశాఖలో కార్మికుడిగా చేసి ఆ తర్వాత రిటైరయ్యాడు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన ఈయన స్థానికంగా ఉండే ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్నినడిపించాడు. దీంతో భర్తకు తెలియకుండా ఆ మహిళ ప్రియుడితో ఎంచక్కా అతనితో తెరిగేది. ఇంతటితో ఆగకుండా ఇంట్లో భర్తలేని సమయంలో ప్రియుడిని ఏకంగా ఇంటికి రప్పించుకుని కోరికలు తీర్చుకునేది.
ఇదిలా ఉండగా ఇటీవల తన భార్యతో ఆ 63 ఏళ్ల వ్యక్తి బయట ఓ చోట చూడకూడని స్థితిలో చూశాడు. దీంతో భార్య.. వెంటనే ఇతను నన్ను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడంటూ భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో భర్త నిజంగానే నమ్మాడు. ఇక అనంతరం భార్యాభర్తలు కలిసి అతనిపై దాడికి దిగారు. భర్తతో చేతులు కలిపిన భార్య ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. ఇక అతను మరణించాడని తెలుసుకున్నాక ఎవరికీ అనుమానం రాకుండా ఆ శవాన్ని గ్రామానికి దూరంగా పడేశారు.
అటు నుంచి వెళ్లే స్థానికులు ఆ శవాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో ఇదే విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ముందుగా అతను హార్ట్ ఎటాక్ తో మరణించాడని అందరూ అనుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనంతరం శవాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు.
కాగా పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా పోలీసులు అనుమానితులను విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాగా పోలీసుల స్టైల్ లో భార్యాభర్తలిద్దరినీ విచారించగా అతనిని హత్య చేసింది తామే అంటూ భార్యాభర్తలిద్దరూ ఒప్పుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.