తమ కుమారులు బాగా చదువుకుని గొప్ప ప్రయోజకులైతే చూడాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. దీంట్లో భాగంగానే వారు చిన్నప్పటి నుంచే బాగా చదివేందుకు ప్రోత్సహిస్తూ పరీక్షల్లో మార్కులు తెచ్చుకోకపోతే దండిస్తూ ఉంటారు. అలా ఓ కొడుకుని పరీక్షలు మంచి మార్కులతో పాస్ అవ్వాలని, లేకుంటే బాగుండదంటూ తండ్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తండ్రి వార్నింగ్ కు బెదిరిపోయిన కుమారుడు దారుణానికి పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అది మధ్య ప్రదేశ్ లోని గుణా ప్రాంతం. ఇదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల వీరేంద్ర అనే బాలుడు తల్లిదండ్రుల వద్ద ఉంటూ 10 వ తరగతి చదువుతున్నాడు. అయితే అతని తండ్రి దులిచంద్ అహిర్వార్ పదవ తరగతి ఫెయిల్ అయితే.. బడిత పూజ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆయన కుమారుడు వీరేంద్ర అప్పటి నుంచి భయపడిపోయడు. ఈ క్రమంలో వీరేంద్ర పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఇక తాను.. ఫెయిల్ అవుతానని భయపడిపోతూ తెగ ఒత్తిడికి గురయ్యాడు.
ఇది కూడా చదవండి: మైనర్ కూతురిపై తండ్రి దారుణం.!
ఇలా అయితే కాదని భావించిన ఆ బాలుడు ఏకంగా తండ్రి హత్యకే ప్లాన్ వేశాడు. ఇక ఏప్రిల్ 3న తండ్రి నిద్రలో ఉండగా వీరేంద్ర కత్తితో పొడిచి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇంటికి వెళ్లి చూస్తే.. దులిచంద్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే స్థానికులు అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లగా మరణించాడని వైద్యులు తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.