చేతులు లేని వ్యక్తి రాళ్లు విసిరాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కొందరు వ్యక్తులు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లో ఖర్గోన్ జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా భారీ ఊరేగింపు తీశారు. ఈ ఊరేగింపులో అల్లర్లు చెలరేగాయి. దీంతో కొందరు ముస్లింలు రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాళ్లు రువ్వారంటూ కొందరిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..! ఆరోజు ఏమైందంటే?
ఇదిలా ఉంటే కేసు నమోదు చేసిన పేర్లలో 2005లో జరిగిన ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వసీం షేక్ పేరును కూడా చేర్చడం కాస్త హాస్యస్పదానికి గురి చేస్తుంది. దీంతో అతనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చేతులు లేని వ్యక్తి రాళ్లు ఎలా విసురుతాడంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.