మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీకి చెందిన తివారీ అనే వ్యక్తితో గత నెల 19న మహారాష్ట్రకు చెందిన మహిళకి తల్లిదండ్రులు కట్నాలు, కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. ఇక పెళ్లై మూడో రోజులు అవుతుంది. కొత్త కోడలు వచ్చిందని అత్తింటివాళ్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే భర్త ఏదో పని మీద అలా బయటకు వెళ్లాడు. ఇంట్లో అత్తా,మామ ఇద్దరే ఉన్నారు. కొత్త పెళ్లి కూతురు ఇదే మంచి సమయం అని భావించి దారుణానికి పాల్పడింది.
ఇది కూడా చదవండి: షాకింగ్ సీన్: నడుము దగ్గర అది దాచి పోలీసులకు షాకిచ్చిన కాలేజీ అమ్మాయి!
మెల్లగా పాలు తీసుకుని అందులో మత్తు పదార్థం కలిపి అత్తామామలకు ఇచ్చింది. కోడలు ఆప్యాయంగా ఇచ్చిందని వాళ్లు కాదనకుండా ఆ పాలు తాగి ఇద్దరూ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఇక బీరువాలో ఉన్న బంగారం, డబ్బులు కాజేసి పత్తా లేకుండా చెక్కేసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరుగా లొంగిపోయిన కొత్త పెళ్లి కూతురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో కొత్త పెళ్లి కూతురు తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.