Crime News : కూతురి ప్రియుడిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.. తల్లి,కూతుళ్లు మాత్రమే ఉన్న ఆ ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. అన్నీ తానై చూసుకున్నాడు. చివరకు కూతురుకు తెలియకుండా తల్లిని కూడా లైన్లో పెట్టాడు. కూతురు లేని సమయంలో తల్లితో సరసాలు ఆడటం మొదలుపెట్టాడు. ప్రియుడు, తల్లి సంబంధం గురించి తెలుసుకున్న ఆమె చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్రిదుర్గ టౌన్లో నివాసం ఉండే కుమార్ ఓ సెల్ ఫోన్ స్టోర్లో పనిచేస్తున్నాడు. తరుచూ అక్కడికి వచ్చే సునీత అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సునీత, కుమార్ను ఇంటికి తీసుకెళ్లి తల్లి పద్మావతికి పరిచయం చేసింది.
ఇక అప్పటినుంచి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. మగతోడు లేని ఆ ఇంటికి అన్నీ తానై చేసేవాడు. పద్మావతికి కూడా కుమార్పై మంచి అభిప్రాయం ఏర్పడింది. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఆమెకు కుమార్ మీద మనసైంది. కూతురు లేని సమయంలో అతడితో క్లోజ్గా ఉండేది. కొన్ని రోజుల తర్వాత పద్మావతి చనువును గ్రహించిన అతడు, ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. సునీతకు తెలియకుండా ఇద్దరూ కలుస్తూ ఉండేవారు. తమ సంబంధం కూతురుకు తెలియకుండా చాలా జాగ్రత్త పడేది పద్మావతి. కుమార్కు, సునీతకు వీలైనంత త్వరగా వివాహం చేయాలని భావించింది. ఓ రోజు తల్లి, ప్రియుడు క్లోజ్గా ఉండగా సునీత చూసింది.
కన్న తల్లి తనను మోసం చేయటం తట్టుకోలేకపోయింది. ఇంట్లో తన గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి కారణం తల్లి, ప్రియుడేనని పేర్కొంటూ ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టింది. ఆ సూసైడ్ నోట్ చూసిన పద్మావతి దాన్ని కాల్చిబూడిద చేసింది. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సూసైడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పద్మావతి, కుమార్లను విచారించారు. పద్మావతి పొంతనలేని సమాధానాలు చెప్పటంతో తమ స్టైల్లో విచారించారు. జరిగిందంతా చెప్పింది. పోలీసులు సునీత చావుకు కారణమైన పద్మావతి, కుమార్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : చావుకే భయాన్ని కలిగించిన సౌదీ అరేబియా! ఒకేసారి 81 మందికి ఉరి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.