Jagtial Crime: జగిత్యాల జిల్లా, బీర్పూర్ మండలం తుంగూరులో దారుణం జరిగింది. ఇంటి రహదారి కోసం సర్వే చేస్తున్న అధికారులపై ఓ రైతు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తుంగూరు గ్రామంలో ఓ ఇంటి వద్ద ఎంపీవో రామకృష్ణ రాజు, ఎస్సై గౌతమ్, ఎమ్మార్వో ఫరీదుద్దీన్, ఇతర అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగాధర్ అనే వ్యక్తి పొలంలో మందు పిచికారి చేసే డబ్బాలో పెట్రోల్ పోసి అధికారులపై స్ప్రే చేశాడు. అనంతరం నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణ రాజుకు గాయాలయ్యాయి. మిగిలిన అధికారులు త్రుటితో తప్పించుకున్నారు. గాయపడ్డ ఎంపీవోను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు గంగాధర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా, గంగాధర్ ఇంటి వద్ద ఉన్న దారి విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గంగాధర్ రోడ్డుకు అడ్డంగా కట్టెలు పెట్టాడు. ఎవరూ నడవకుండా దారి మూసేశాడు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు అధికారులు వెళ్లారు. గంగాధర్ వారిపై పెట్రోల్ పిచికారి చేసి నిప్పంటించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Hyderabad: భార్యపై భర్తకు అనుమానం ..బ్యూటీ పార్లర్ కు వెళ్తూ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.