ఈ మధ్యకాలంలో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా వివాహేతర సంబంధాల కారణంగానే జరుగుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త ఇలా ఎవరికీ వారు అక్రమ సంబంధాల ఉచ్చులో చిక్కుకుని నిండు జీవితాలను నాశనం చేసుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత దారుణ హత్యకు గురైందని స్థానికులు చెబుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తేై.. హైదరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్ట ప్రాంతం. ఇదే ప్రాంతంలో నెల్లూరు జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రసాద్ ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. కుక్ గా పని చేస్తూ జీవితాన్ని గడిపేవాడు. కాగా శిరీష అనే మహిళ పది రోజులకొకసారి ప్రసాద్ ఇంటికి వస్తుండేదట. దీంతో ఇద్దరు అలా వచ్చిన క్రమంలో ఎంజాయ్ చేస్తుండేవారని తెలుస్తోంది. అయితే ఇటీవల కూడా ఈ వివాహిత ప్రసాద్ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఇద్దరు కలిసి ఉన్నారు.
ఇది కూడా చదవండి: Rajanna Sircilla: పెళ్లికి ముందే రెండేళ్ల చిన్నోడితో ప్రేమలో పడింది.. ఇక భర్తతో ఉండలేక ఏకంగా!ఇదిలా ఉంటే ప్రసాద్ ఉంటున్న ఇంటి నుంచి గత మూడు రోజుల నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఈ క్రమంలోనే ప్రసాద్ ఇంటి పక్కన ఉంటున్న మరో వ్యక్తికి కాల్ చేసి మా ఇంట్లో శిరీష అనే మహిళ చనిపోయిందని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇక ఈ తరుణంలోనే అనుమానమొచ్చిన స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా అనుమానాస్పద స్థితిలో శిరీష రక్తంతో నిండిన మరకలతో చనిపోయి ఉంది. ఈ సీన్ ను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకుని పరీశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక స్థానికుల ప్రకారం ఆ మహిళ ప్రసాద్ ఇంటికి పది రోజులకొకసారి వచ్చేదని భార్యనా లేక మరోవరనేది తెలియదంటూ చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.