IPL: ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా దంపతులపై కొందరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఇద్దర్నీ అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శివమ్ తివారీ, రూబీలు భార్యాభర్తలు. రామ్భాగ్లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు శివమ్ తండ్రి దీప్ తివారి కూడా ఉంటున్నాడు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో దీప్ తివారీ నిద్రపోవటానికి మేడపైకి వెళ్లాడు. ఆ సమయంలో శివమ్, రూబీలు ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. ఉదయం 6.30 గంటలకు దీప్ తివారి కిందకు దిగి వచ్చాడు. కింద హాలులో రక్తపు మడుగుల్లో పడిఉన్న కొడుకు,కోడల్ని చూసి షాక్ తిన్నాడు.
కొద్ది సేపటి తర్వాత షాక్లోంచి తేరుకుని గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. అతడి అరుపులు విన్న పొరిగింటి వారు అక్కడికి వచ్చారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీప్ తివారిని విచారించారు. ఇంటిలోంచి ఓ స్టీల్ సాసర్ను స్వాధీనం చేసుకున్నారు. హంతకులు అందులో రక్తపు మరకలు అయిన కత్తినిగానీ, చేతుల్ని కానీ, శుభ్రం చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. అతి త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని అన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Young Woman: సిగరేట్ సరదా.. స్నేహితులే ఆ అమ్మాయి పాలిట శత్రువులయ్యారు..