తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసులో రోజుకో ట్వీస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార ఘటనలో చేసిన పనిని ఒకరిపై మరొకరు చెప్పుకున్నట్లు పోలీలుసు వెల్లడించారు. ముగ్గురు మైనర్లను, ఒక మేజర్ ను విడివిడిగా విచారించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, సాదుద్దీన్ను విచారిస్తున్న క్రమంలో అతను.. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పాడని పోలీసులు అంటున్నారు. దీంతో ఏది నిజమో తెలియక పోలీసులు గందరగోళానికి లోనవుతున్నారు.
అమ్నేషియా పబ్ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు నిందితులను ఘటనాస్థానికి తీసుకెళ్లి సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. అమ్నేషియా పబ్ , జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36,44 లో పరిసప్రాంతాల్లో నిందితులను తీసుకెళ్లారు. ఘటన జరిగిన తీరును పోలీసులు తెలుసుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ ను ఈ నెల 10 నుంచి జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో అతడు చెప్పిన వివరాల ఆధారంగా మిగిలిన వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని సీన్ రీకన్ స్ట్రక్షన్ కు అత్యాచారా ఘటన జరిగిన పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడ వారు చెప్పే వివరాలను పోలీసులు నమోదు చేసుకుంటారు. అనంతరం మళ్లీ పీఎస్ కు తీసుకెళ్లి విచారణ కొనసాగించనున్నారు.
ఇదీ చదవండి: అమ్నేషియా పబ్ కేసులో మరో ట్విస్ట్! విచారణలో కీలక విషయాలు వెలుగులోకి..