ఆడవారు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణిస్తున్నారు. వాళ్ళు ఎంత అభివృద్ది చెందుతున్నా.. వరకట్న వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇలాగే హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న సూర్యోదయనగర్లో వరకట్న వేధింపులకు ఓ యువతి బలైంది. ఆ వివరాల్లోకి వెళితే..
డాక్టర్ వంగ భారతిది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నర్సాపూర్. ఈమె వయసు (31). రమేష్తో ఆమెకు గతేడాది వివాహం జరిగింది. ఎకరం పొలం, రూ.5 లక్షల నగదు, 20 తులాల బంగారం, ఇతర లాంఛనాలను వరకట్నంగా అందజేశారు. రమేష్ కూడా ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్న రమేష్ అదనపు కట్నం కోసం రమేష్ భార్యను వేధించసాగాడు.
భర్త వేధింపులు భరించలేక కొన్ని రోజుల క్రితం భారతి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఆమె శుక్రవారం ఆత్మహత్య చేసుకుని కన్నుమూసింది. ఈ మేరకు తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త రమేష్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.